Wednesday, April 24, 2024

ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీమ్.. స‌జ్జ‌ల

ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీమ్ అని ఇందులో కోటంరెడ్డి లాంటి వాళ్లు పాత్రధారులు మాత్రమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ జరగలేదన్నారు. ఫోన్‌ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ చేశారన్నారు. అలాంటప్పుడు విచారణ ఏముంటుందన్నారు. రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉందని లేని విషయాలు ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందని స‌జ్జ‌ల‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement