Saturday, April 20, 2024

పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి..!

పెట్రోల్ తక్కువ వచ్చిందని ప్రశ్నించిన వినియోగదారుడిపై దాడి చేసి పిడి గుద్దులుతో విరుచుకుపడిన ఘటన రామవరప్పడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పడు ఇండియన్ పెట్రోల్ బంక్ లో గుణదలకి చెందిన వర్మ అనే వ్యక్తి రూ.150 ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాడు. కానీ అందులో లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో ఆయిల్ తక్కువ వస్తుందని బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో ఒక్కసారిగా సిబ్బంది అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వర్మ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement