Saturday, April 20, 2024

ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం ఉద్యోగ‌ సంఘాలకు మంచిది కాదు : బొత్స స‌త్య‌నారాయ‌ణ

ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోవడం మంచిది కాదని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అభిప్రాయపడ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చలకు వారు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉంటామన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమేనని, కానీ పీఆర్సీ విషయంలో వారు రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుందన్నారు. ఏపీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తమ కమిటీతో చర్చలు జరిపిందన్నారు. వారు లేవనెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కొత్త పీఆర్సీ కారణంగా తమ జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని, అయితే జీతం అందుకుంటే కదా? పెరిగేది? తగ్గేది తెలిసేది అనేది బొత్స సత్యనారాయణ అన్నారు. చర్చలకు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యోగులు అర్ధం చేసుకోకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement