Thursday, April 25, 2024

చంద్ర‌బాబుపై పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని పేర్ని నాని అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఇవే త‌నకు చివరి ఎన్నికలు అన్నాడు.. ఇప్పుడు పోలవరం వెళ్ళి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని చురకలు అంటించారు. చంద్రబాబును, లోకేష్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందట.. కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలాగ చంద్రబాబు ? అని ఫైర్ అయ్యారు. పాత కాలపు స్వామిజీల తంతులా ఉందని.. చంద్రబాబుకు మైండ్ ఉందా ? అని నిలదీశారు. ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు.. మొన్నటి వరకు బాదుడే బాదుడు అన్నాడని మండిపడ్డారు. హెరిటేజ్ లో రేట్లు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా ? జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement