Thursday, April 18, 2024

వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టాలి.. చంద్రబాబు

వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండడానికి రాజరికం కాదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతామన్నారు. తెలుగుజాతి అనేక రంగాల్లో రాణిస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారి కోసం పనిచేయడం టీడీపీ బాధ్యత అన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలుగోడు రాణిస్తున్నాడరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement