Saturday, March 23, 2024

పాడైన రోడ్లకు మరమ్మతులు.. శ్రమదానం చేయనున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయనున్నారు. ధ్వంసమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 2018లో  పవన్ కల్యాణ్ గారు ఈ రోడ్డుపైనే పోరాట యాత్రలో భాగంగా కవాతు నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి తెలిసిందే. నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి… ప్రభుత్వం స్పందించని పక్షంలో.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: నెల రోజులు పూర్తి చేసుకున్న ప్రజా సంగ్రామ యాత్ర..

Advertisement

తాజా వార్తలు

Advertisement