Friday, April 19, 2024

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండ: పవన్

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందన్నారు. 2010లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించిందని గుర్తు చేశారు. కొత్తగా ఇప్పుడు కార్పోరేషన్ ఎందుకు? వ్యవస్థలను మార్చే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. సుప్రీం కోర్టు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. కార్పొరేషన్‌లో చేరని ఉద్యోగులను బెదిరిస్తున్నారన్న పవన్.. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు.. నిధులు దారి మళ్లించేందుకేనా? అని ప్రశ్నించారు. బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? అని నిలదీశారు. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా?అని ప్రశ్నించారు. 73 సొసైటీలలో ఉన్న నాలుగు వేల మంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా? అని అడిగారు. నాలుగు వేల మంది ఉద్యోగులకు వైసీపీ పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చింది? అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement