Friday, April 26, 2024

Pawan: పార పట్టిన పవన్.. రోడ్లపై శ్రమదానం!

ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ గత కొద్ది రోజులుగా నినసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార రోడ్లపై శ్రమదానం చేశారు. పట్టి.. కంకర ఎత్తిపోస్తూ రోడ్లు బాగు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి దీక్షా స్థలానికి చేరుకునే ముందుగా పవన్ కల్యాణ్ తాడేపల్లి వడ్డేశ్వరంలో రోడ్డుపై గ్రావెల్ వేసి శ్రమదానం చేశారు. ఆయన వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాయకులు పాల్గొని రోడ్లపై కంకర పోశారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా దీక్ష చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement