Wednesday, March 27, 2024

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు – పవన్ కల్యాణ్

ఆమరావతి: అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్‌.. ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. .

.”అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారు. రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఏపీ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా పరాజయంపాలైన విషయం ,. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం తెలసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement