Saturday, April 20, 2024

అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు: పవన్

ఏపీలోని రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రహదారుల గుంతలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న విధంగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. రూ.5వేల కోట్ల రహదారి నిధుల మళ్లించేశారు’’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement