Saturday, April 20, 2024

ఎమ్మెల్యేల‌పై దాడి.. ఖండించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ అసెంబ్లీ జ‌రిగిన టీడీపీ ఎమ్మెల్యేల‌పై జ‌రిగిన దాడిని ఖండిస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో దాడి ఘటనపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శానసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే ఈ పరిణామాలు దురదృష్టకరమైనవన్నారు. ప్రజల గొంతునొక్కే జీవో నెంబరు 1పై చర్చను కోరిన బుచ్చయ్య చౌదరి, డోలి బాలవీరాంజనేయస్వామిపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. అర్థవంతమైన చర్యలు లేకుండా దాడులేమిటి? – చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని కోరారు. ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే పరిణామాలని అన్నారు. జీవో నం.1 పై చర్చకు అనుమతించకపోవడం దారుణమని అన్నారు. స్వామి, బుచ్చయ్యపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement