Friday, April 19, 2024

తిరుపతి లో జనసేనాని పాదయాత్ర..

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వచ్చే నెల 3న తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 3న తిరుపతిలోని ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు జరిగే పాదయాత్రలో పవన్ పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అలాగే, పవన్ రెండో విడతలో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ తో పాటు మిగిలిన బీజేపీ అభ్యర్థులు మరి కొంతమంది సినీ స్టార్స్ తిరుపతిలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement