Thursday, April 25, 2024

విభజన హామీలు అమలు చేయాలి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. ఢిల్లీలో దీక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విభజన హామీలను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు సాయికిరణ్, ఆంద్రప్రదేశ్ వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు వినుకొండ వెంకట సుబ్బారావు తదితరులు దీక్షకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పెరిగిన వ్యయం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని, నిర్వాసితులకు పూర్తి పరిహారమివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement