Friday, April 19, 2024

కిసాన్‌ క్రాఫ్ట్ కు నేపాల్‌ నుంచి ఆర్డర్‌.. 5 వేల ఇంటర్‌ కల్టివేటర్ల సప్లయ్ కి 20 కోట్ల ఆర్డర్‌..

న్యూఢిల్లీ : చిన్న రైతుల కోసం బెంగళూరుకు చెందిన కిసాన్‌క్రాఫ్ట్‌ అనే అగ్రి- ఎక్విప్‌మెంట్‌ కంపెనీకి నేపాల్‌ నుంచి ఆర్డర్‌ లభించింది. ఇటివల ప్రారంభించిన 46 ఎకరాల నెల్లూరు క్యాంపస్‌లో 5 వేల ఇంటర్ కల్టివేటర్‌లు దేశీయంగా భారతదేశంలో తయారు చేయబడతాయి. సార్క్‌, ఆసియా, ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకుని 2022లో మరింత దూకుడుగా ఎగుమతులను పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది. ఇంటర్‌కల్టివేటర్‌ అనేది చిన్న రైతులకు కలుపుతీయడం, మట్టిని తిప్పడం, మట్టి మల్చింగ్‌ కోసం ఉపయోగించే బహుళ- ఉపయోగ సాధనం, పంట్లను నాటడానికి ముందు మరియు తర్వాత నేల వదులుగా మరియు సున్నితంగా చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. కిసాన్‌క్రాఫ్ట్‌ ప్రస్తుతం తన నెల్లూరు ప్లాంట్‌లో సంవత్సరానికి 75 వేల యూనిట్ల ఇంటర్‌ కల్టివేటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కిసాన్‌ క్రాఫ్ట్‌ లిమిటెడ్‌ సీఈవో అంకిత్‌ చిటాలియా నేపాల్‌ ఆర్డర్‌ గురించి స్పందిస్తూ… నెల్లూరులోని తమ కొత్త ఫ్యాక్టరీలో 2 వారాల క్రితం ఉత్పత్తిని ప్రారంభించిన నాటి నుంచి అనేక సార్క్‌ దేశాలు, ఆఫ్రికా నుంచి యంత్రాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. నేపాల్‌ నుంచి 5 వేల ఇంటర్‌కల్టివేటర్‌ల కోసం ఎగుమతి ఆర్డర్‌ విలువ దాదాపు రూ.20 కోట్లుగా ఉంది. త్వరలో మరిన్ని ఎగుమతి ఆర్డర్లను పొందగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ యంత్రాలు భారతదేశంలో కఠినమైన వ్యవసాయ పరిస్థితులలో నిరూపించబడ్డాయి. ప్లాట్ల పరిమాణాలు, సామర్థ్యం, లక్ష్య వినియోగాల పరంగా తాము లక్ష్యంగా ఎంచుకున్న దేశాలతో భారీ సారూప్యత ఉందని వివరించారు. సరళమైన, కఠినమైన, బహుళ వినియోగ, సరసమైన, సులభంగా సేవలు అందించే పరికరాలను ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement