Thursday, April 25, 2024

Breaking: ప్రకాశం జిల్లాలో రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి.. ఏడుగురికి గాయలు

రెండు ఆటోలు ఢీకొని ఒకరు మృతి చెంది, ఏడుగురికి గాయాలయిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి పొదిలి నుండి దర్శి వెళ్లే రహదారిలో తోళ్లమడుగు వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకుని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement