Saturday, April 20, 2024

ఏపీలో పరిస్థితులపై.. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లారు. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, పవన్ వ్యాఖ్యలను బీజేపీ పెద్దల దృష్టికి సోము వీర్రాజు తీసుకెళ్లారు. నేటి సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను శివప్రకాష్‌జీకి వివరించారు. మొన్న సోము వీర్రాజు, నిన్న చంద్రబాబు పవన్‌ ను‌ కలవడంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.

విశాఖ ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం, నేతల మీద పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తీరుపైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. రూట్ మ్యాప్ అంశాన్ని ప్రస్తావిస్తూ .. అవసరమైతే తన విధానం మార్చుకోవాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement