Friday, April 19, 2024

అమ్మో అవి రోడ్లా, మొత్తం గోతులే.. ఏపీ రోడ్ల‌పై చిన‌జీయ‌ర్ చ‌లోక్తులు!

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఆధ్యాత్మిక గురువు చిన‌జీయర్ స్వామి ఇవ్వాల‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై ఆయ‌న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి ప్రయాణించేందుకు దాదాపు మూడు గంట‌ల సమయం పట్టిందని చెప్పారు. ఒక్కో ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ప్రయాణంలో ఇబ్బంది ఏర్పడడానికి బహుశా… రోడ్ల మీద గోతులు ఎక్కువ ఉండవచ్చ‌ని చిన‌జీయ‌ర్‌స్వామి చలోక్తులు విసిరారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో రాజమండ్రిలో స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల ప‌రిస్థితిపై చిన‌జీయ‌ర్ చేసిన హాట్ కామెంట్స్  ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement