Monday, March 25, 2024

ఏఈ పోస్టుల పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రధేశ్ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్‌ సబ్‌ సర్వీసెస్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మే 14, 15 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు.

మే 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌- 3 ఎన్విరానమెంటల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌(కామన్‌) పరీక్షలు, 15న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌- 1 జీఎస్‌ఎంఏ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్‌, మెకానికల్‌(కామన్‌) పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షకు వారం ముందు నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement