Friday, April 19, 2024

Flash: పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ క్యాంటీన్‌లో నిర్వహకులు మాంసాహారం వండటం కలకల రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఈ క్యాంటిన్‎లో అల్పాహారం, అన్నదానం చేస్తుంటారు. కానీ..అదే క్యాంటిన్‎లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీస్తోంది. ఇతరుల పేరుతో క్యాంటీన్ దక్కించుకున్న వైసీపీ నేత షరీఫ్..ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండి బయటకి సరఫరా చేస్తున్నారు. భక్తులు గుర్తించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement