Friday, April 19, 2024

జగన్ ఎన్ని జన్మలెత్తినా.. కుప్పంలో వైసీపీ గెలవదు.. చంద్రబాబు

జగన్ ఎన్ని జన్మలెత్తినా కుప్పంలో వైసీపీ గెలవదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా టీడీపీ కీలకపాత్ర పోషించిందన్నారు. ఫ్లెక్సీ తగలబెడితే పోలీస్ డాగ్ లను తీసుకొచ్చారు.. తునిలో మా నాయకుడిపైన హత్యాయత్నం జరిగింది..అప్పుడు పోలీస్ డాగ్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు.

తనపై రాళ్లు వేస్తే భయపడి పర్యటనలు చేయనని ప్రభుత్వం అనుకుంటోందన్నారు. తనపై పూలేస్తే .. ఆ పూలల్లో రాళ్లున్నాయట.. రేపు ఆ పూలల్లో బాంబు ఉందని అంటారా అని ప్రశ్నించారు. మూడు రాజధానులు వద్దని.. ఒకే రాజధాని కావాలని ఆదోని, ఎమ్మిగనూరు ప్రజలు నినదించారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement