Saturday, April 20, 2024

ప్రార్థ‌నా మందిరాల‌కు వెళ్తున్నారా ? అయితే ఆగండి!

ఏపీలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు. మరికొన్ని ఆలయాల్లో దర్శన వేళల్లో మార్పులు చేశారు. విశాఖలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు అయిదు గంటల పాటు మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం ఉంటుంది. అయితే, వైదిక కార్యక్రమాలు మాత్రం యథాతథంగా కొనసాగనున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కొవిడ్ విలయం నేపథ్యంలో నేటి  నుంచి అన్నవరం సహా జిల్లాలోని  ప్రధాన ఆలయాల్లో  భక్తులకు  దర్శనాలు నిలిపివేశారు. జిల్లాలో  దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను పూర్తిగా మూసివేయాల‌ని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌తో పూజారి, ఇమామ్‌, పాస్ట‌ర్ వంటి మ‌త పెద్ద‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement