Friday, April 19, 2024

అలసత్వం వద్దు..కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని ప్రభుత్వం మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామని సీఎం అన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇక ఏపీలో నిన్న1628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్త కేసులు సంఖ్య 19,41,724కు పెరిగాయి. తాజాగా 2,744 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 19,5,000 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో 22 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 13,154కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇది కూడా చదవండి : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement