Thursday, April 18, 2024

ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర గుండా పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ 318 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి ఉంటుంది. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించడం కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement