Friday, March 29, 2024

AP: ప్రమాణస్వీకారంలో ఆసక్తికర సన్నివేశం.. సీఎం జగన్‌ కాళ్లు మొక్కిన మంత్రులు

ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పలువురు మంత్రులు సీఎం జగన్‌ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్‌ కాళ్లు మొక్కారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి నారాయణస్వామి సీఎం జగన్‌ కాళ్లు తాకి నమస్కరించగా.. మంత్రి రోజా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించిన అనంతరం ఆయన చేతిని ముద్దాడి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. కొత్తగా మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు తదితరులు సైతం జగన్ కాళ్లు మొక్కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement