Thursday, April 25, 2024

నా ఎమ్మెల్సీ పదవిని నారా లోకేష్ కు అంకితం – శ్రీకాంత్

తిరుపతి మార్చి 18 (ప్రభ న్యూస్ ) : 2024 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ గా గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. శనివారం కంచర్ల శ్రీకాంత్ కు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. టౌన్ క్లబ్ సర్కిల్లో కాపు కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. అంతకుముందు శ్రీకాంత్ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి పూలమాల వేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని నారా లోకేష్ కు అంకితం చేస్తున్నానని తెలిపారు. తన విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మనమంతా ఇదే ఉత్సాహంతో పనిచేసి 2024 ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేద్దామని పేర్కొన్నారు. వైసిపి పాలనపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా సన్నిగిలిందని, అందుకు నిదర్శనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన గెలుపే నని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి, టిడిపి రాష్ట్ర నేత జేబీ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ, పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, కృష్ణ యాదవ్, నైనారు మహేష్ యాదవ్, ఆర్ పి శ్రీనివాసులు, ఊట్ల సురేంద్ర నాయుడు, రుద్రకోటి సదాశివం, చెంబకూరు రాజయ్య, సింగంశెట్టి సుబ్బరామయ్య,పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్: టి పి టి జీరో వన్ : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు.w

Advertisement

తాజా వార్తలు

Advertisement