Saturday, April 20, 2024

రైతుల సంక్షేమమే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ధ్యేయం

రైతుల సంక్షేమమే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ధ్యేయంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారని పలువురు రైతులు తెలుపుతున్నారు. మండల కేంద్రమైన వరికుంటపాడులోని రైతు బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పవర్ స్పేర్ ను ఉచితంగా ట్రస్ట్ సభ్యులు అందజేశారు. సామాజిక సేవలో ప్రతినిత్యం ముందుంటూ ప్రజాసేవే అంకితంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా కాకర్ల సురేష్ ముందుంటున్నాడని, ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా అందిస్తూ ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారని రైతులు కోరుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ కాకర్ల సురేష్ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ మెడికల్ క్యాంపులు, రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఆరోగ్యాలు బాగాలేని నిరుపేదలకు ఆర్థిక సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మానవసేవే మాధవసేవ అని చాటుతున్నాడు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కాకర్ల సురేష్ కు పలువురు రైతులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ట్రస్టు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement