Tuesday, April 23, 2024

ఎన్టీఆర్ ఆశయ సాధనకు మ‌నంద‌రం కృషి చేయాలి

దుత్తలూరు, మార్చి 29 (ప్రభ న్యూస్) : ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ టీడీపి నేతలతో కలసి బస్టాండ్ సెంటర్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 41 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద వాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో నాడు అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి అట్టడుగు, బడుగు బలహీనర్గాల అభ్యునతికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇదే ఉత్సాహంతో పని చేసి 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకుందాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతన బోయిన. బయ్యన్న యాదవ్ స్టేట్ మైనారిటీ నాయకులు షేక్ రియాజ్,మండల టీడీపి నాయకులు నల్లి బోగరాజు, ఓబుల్ రెడ్డి, బొత్స నరసింహ, సందాని, వెంకట స్వామి, అంబటి మస్తాన్,సుమన్ యాదవ్, నల్లిపోగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement