Sunday, March 24, 2024

40 కుటుంబాలు వైసీపీ లో చేరిక

పొదలకూరు, : పొదలకూరు శివాలయం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ కొత్త సుబ్బయ్యతో పాటు 40 కుటుంబాల శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీ ని వీడి వైసీపీ గూటికి చేరారు. వీరందరికి కాకాణి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైసీపీ లోకి చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సర్వేపల్లిలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి పార్టీలో చేరుతున్న వారికి తగు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, మద్దిరెడ్డి రమణారెడ్డి, మన్నవరపు గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement