Wednesday, April 24, 2024

మహిళల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యం

గూడూరు రూరల్: మహిళల అభ్యున్నతి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి పేర్కొన్నారు. గురువారం ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల అనంతరం గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, చెన్నూరు ఇంచార్జి షేక్ కరిముల్లాతో కలిసి మట్టం శ్రావణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మట్టం శ్రావణి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతి కోసం నారా చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారన్నారు. మహిళల రక్షణ కొసం అనేక చట్టాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేయడం జరిగిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో పనబాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు మట్టం మురళి,ఇందుకూరు,లక్ష్మణ్ రెడ్డి,సురేష్, అనిల్, వెంకటేశ్వర్లు, మాధవి, గోవిందమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement