Wednesday, April 24, 2024

వడదెబ్బతో.. వ్యక్తి మృతి

ముత్తుకూరు ( ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కర్ణాల వీధికి చెందిన కరణం సురేష్ కుమార్(40) అనే వ్యక్తి వ‌డ‌దెబ్బ‌తో క‌న్నుమూశాడు. శనివారం ఎండ వేడిమి కి తట్టుకోలేక వడదెబ్బ గురై మృతి చెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement