Friday, March 29, 2024

కోట‌లో టిడిపి ఎంపిల‌తో నారా లోకేష్ భారీ ర్యాలీ…

కోట – తిరుపతి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనిచేసే పనబాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కోట మండలం వెంకన్నపాలెం గ్రామపంచాయతీ నుండి, వీరారెడ్డి సత్రం, క్రాస్ రోడ్, శ్యామసుందర పురం, కోట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు .దారి పొడుగునా నారా లోకేష్ కు హారతులిచ్చి, నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వమన్నార‌ని, అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని దో చేస్తున్నారన్నారు. పప్పు, ఉప్పు ,నూనె , పెట్రోల్ ,డీజిల్, రేట్లు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రత్యేకహోదా గానీ, దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. మన ఇంటి మహాలక్ష్మి పనబాక లక్ష్మి గెలిపించి మీ ప్రాంత అభివృద్ధికి కలిసి తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కనకమేడల, గల్ల జయదేవ్, రామ్మోహన్ నాయుడు, పనబాక కృష్ణయ్య, పాశం సునీల్ కుమార్, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, జలీల్ అహ్మద్, కోట ,వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, నాయకులు ,అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement