Friday, April 19, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకాణి

పొదలకూరు, ఏప్రిల్ : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా పొదలకూరు మండలం తోడేరులో శనివారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఎన్నిక ఏకపక్షంగా జరుగుతున్నట్లు కనిపిస్తోందని, వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. మాజీమంత్రి నారా చంద్రబాబునాయుడు, లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు, మాజీ మంత్రులు, ఉద్దండులైన నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ టీడీపీకి మరో సారి శృంగభంగం తప్పదన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తాను రెండేళ్లుగా సర్వేపల్లిలో చేస్తున్న అభివృద్ధి పనులు తమ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కి భారీ మెజారిటీ సాధించి పెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement