Wednesday, April 24, 2024

రైతు ప్రభుత్వం మాది – మంత్రి ఆదిమూల‌పు సురేష్

మనుబోలు – రైతులను కష్టాల్లో అదుకోని వారి కి భరోసా ఇచ్చింది తమ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలం సురేష్ ఆన్నారు. సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీనియర్ యం యల్ ఏ పార్ధసారధి తో కలసి మండలంలోని కాగితాలపూర్,యల్.యన్.పురం పిడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకి గిట్టుబాటు ధర కల్పించి రైతు పండించిన పంట ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. చంద్ర బాబు, లోకేష్ మాటలు కోటలు దాటాయ్యే తప్ప వారి ప్రభుత్వం లో ఏ వారికి న్యాయం జరగలేదన్నారు. పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అంద జేసినామన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. చంద్రబాబు,లోకేష్ లు అజ్ఞానుల‌ని, వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. డిల్లీ వరకు మన వాణి వినిపించేందుకు గురు మూర్తిని గెలిపించాలన్నారు. పార్థసారథి మాట్లాడుతూ జగన్ హామీలను 95 శాతం పూర్తిగా నెరవేర్చారన్నారు.అవినీతి రహిత పాలన చేస్తున్న మన్నారు. ప్రతి పేదవాడికి అండ నిలుస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హరగోపాల్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి గుమ్మా రవి రాజేష్ అశోక్ ఏడుకొండలు దశయ్య వెంకటసుబ్బయ్య రామసుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement