Friday, April 26, 2024

బుచ్చిలో లేడీ కిలాడీలు.. లక్ష రూపాయల నగదు 30 గ్రాముల బంగారం అపహరణ

బుచ్చిరెడ్డిపాలెం, ప్రభ న్యూస్ : ముగ్గురు కిలాడీలు ఓ మహిళను మాయ చేసి ఆమె బ్యాగ్ లోని లక్ష రూపాయల నగదు 30 గ్రాముల బంగారును సోమవారం ఆపహరించారు. బాధితురాలు కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి నెల్లూరు నుండి బుచ్చిరెడ్డి పాలానికి ఆర్టిసి బస్సులో వచ్చింది. సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు గంగా స్వీట్స్ కి వెళ్లి స్వీట్స్ కొనుక్కొని ఆటో ఎక్కే ప్రయత్నంలో చెన్నూరు రోడ్డుకు చేరుకుంది. ఆమెను వెంబడిస్తూ ముగ్గురు మహిళలు ఓ బాలిక వచ్చినట్లు సిసి ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.

- Advertisement -

విజయలక్ష్మి ఆటోమే వారు కూడా ఎక్కడంతో ఆమె వారిని ప్రశ్నించింది. అయితే తాము కూడా అదే మార్గంలో వెళ్లాలంటే నమ్మ పలికారు. అంబేద్కర్ నగర్లో ఆటో దిగి ఇంటికి వెళ్లి బ్యాగ్ చూసుకునేటప్పటికీ అందులోని నగదు నగలు మాయమైనట్టు గుర్తించింది. వెంటనే బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు సమాచారం అందించింది. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసి ఫుటేజ్ పరిశీలించారు. అనుమానంగా కనిపించిన మహిళలు,ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. నగదు కిలాడి మహిళలు అయి ఉంటారని పోలీసులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement