Thursday, April 25, 2024

వైసిపి ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట

గూడూరు రూరల్:- వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వర ప్రసాద రావు పేర్కొన్నారు.గురువారం గూడూరు పట్టణంలోని ధూర్జితినగర్ ప్రాంతంలో ఉన్న రజక కాలనీలో ఎమ్మెల్యే వరప్రసాదరావు రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్యతో కలిసి పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.రజకుల కోసం కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని దీనితోపాటు రోడ్లు వంటి అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నామని ఆయన తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పనులు ఆపివేయడం జరిగిందని తరువాత పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.ఈయన వెంట రజక కార్పొరేషన్ డైరెక్టర్ యానాదయ్య రజక జిల్లా అధ్యక్షుడు రమణయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement