Friday, April 19, 2024

Nellore: చెరువులో గ‌ల్లంతైన‌ ఐదుగురి మృత‌దేహాల వెలికితీత

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ శాంతినగర్ చెరువులో గ‌ల్లంతైన యువకుల మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. పొదలకూరు మండలంలోని తోడేరులోని చిన్నచెరువులో షికారుకెళ్లిన 10 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతయ్యారు. మరో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో తోడేరు గ్రామంలోని యువకులు 10 మంది చిన్నచెరువుకు వెళ్లారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ చెరువులో చేపలకు మేతవేసే పడవలో వారంతా షికారుకు వెళ్లారు. దాదాపుగా మధ్యకు వెళ్లిన తరువాత పడవలోకి నీరు చేరింది. పడవ మునిగిపోతుందని గ్రహించిన యువకులు చెరువులోకి దూకేశారు. అక్కడ లోతు గరిష్ఠంగా 20 అడుగుల వరకూ ఉంటుందని అంచనా. పడవ నుంచి దూకేసిన వారి బాలాజీ(21), కల్యాణ్‌(28), శ్రీనాథ్‌(18), రఘు(24), ప్రశాంత్‌(29) మృత‌దేహాలు బ‌య‌ట‌కు తీశారు. మిగిలిన ఒక‌రి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement