Friday, March 29, 2024

ఏకగ్రీవంగా ఏపీఈజిఏ తాలూకా ఎన్నిక..

బుచ్చిరెడ్డిపాలెం, ప్రభ న్యూస్ : బుచ్చి తాలూకా ఉద్యోగుల సంఘం ఎన్నిక ఇవ్వాల (సోమవారం) మండల పరిషత్ కార్యాలయంలో ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ జి ఈ ఏ బుచ్చిరెడ్డిపాళెం తాలూకా యూనిట్ ఎన్నికల అధికారిగా ఎస్ కె.ఖాదర్ బాషా, వ్యవహరించారు. ఈ ఎన్నికలకు జిల్లా కోశాధికారి పి వి ఎస్ టి రాంప్రసాద్ ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు. తాలూకా యూనిట్ అధ్యక్షులుగా ఎస్ వి సుబ్బారెడ్డి, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ డివీ నరసింహారావు ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లుగా డాక్టర్ ఏ జైయపాల్, ఏ వెంకటేశ్వర్లు, టి సుధా, ఎస్కే జలీల్ అహ్మద్, కే మధు, ఎస్ కే హమీద్ భాషలు ఎన్నుకోబడ్డారు.

సెక్రటరీగా కరిపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్.కె యూసఫ్ అహ్మద్, జాయింట్ సెక్రటరీలుగా ఆర్ విజయమ్మ, బి.రాములు, ఎన్.సుభాషిని తురక ప్రసాద్ రావు, విజయ్ పవన్ కుమారులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ట్రెజరర్ గా కె.వి శేషగిరిరావు ఎన్నుకోబడ్డారు. నూతనంగా ఏర్పడ్డ బుచ్చిరెడ్డిపాలెం తాలూకా సంఘం ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందని నాయకులు తెలిపారు. నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర సంఘాలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement