Thursday, March 28, 2024

Breaking: నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని చేజర్ల మండలం ఆదూరుపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. స్వల్పంగానే భూకంపం చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement