Friday, April 19, 2024

ఇచ్చిన హామీలు నెర‌వేర్చిన సీఎం జ‌గ‌న్ : ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి

బుచ్చిరెడ్డిపాలెం : కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని పెనుబల్లి గ్రామంలో పొదుపు మహిళలకు ఆసరా చెక్కులు అందజేశారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పొదుపు మహిళలు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పొదుపు మహిళలకు 3 విడతల్లో ఆసరా రుణాల అందజేయడం జరిగింది అన్నారు. మూడో విడతలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 1035 గ్రూపులకు 10128 మంది మహిళలకు 9 కోట్ల 17 లక్షల రూపాయలు రుణాలు అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పొదుపు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను పొదుపు మహిళలు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం లలిత రెడ్డి, మండల కన్వీనర్ చెర్లో సతీష్ రెడ్డి, పెనుబల్లి సర్పంచి ఓడా పెంచలయ్య, జొన్నవాడ ప్రసాద్, సన్నపురెడ్డి నరసింహారెడ్డి, జయరామరెడ్డి, సురా శ్రీనివాసులు రెడ్డి, కోవూరు మురళి, వెంకయ్య, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement