Thursday, April 25, 2024

పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలి – శ్రీరాం చిన‌బాబు..

గూడూరు: – పెరిగిన గ్యాస్ అత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాం చిన్నబాబు కోరారు. పెరిగిన గ్యాస్,సరుకులను ధరలు తగ్గించాలంటూ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నువ్వా చరణ్,ఆసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం స్తంభం కూడలి వద్ద గ్యాస్ బండ లతో శవయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు ప‌న్నుల‌ను ప్రజలపై వేస్తుందని అన్నారు. రానున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి ని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు రవి నాయుడు,టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ఓంప్రకాష్ చరణ్ నాగార్జున యాదవ్ పవన్ కళ్యాణ్ గౌతం కిషోర్ చలం సాయి సద్దాం తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement