Friday, April 19, 2024

గుర్తుతెలియని వాహనం ఢీ – ఇద్దరి మృతి

నెల్లూరు – సూళ్లూరుపేట జాతీయ రహదారి పై హోలిక్రాస్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.. మృతుల‌లో ఒక‌రు తడ శ్రీసిటీ సెజ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న దేవిరెడ్డి నర్సింహులు కలువాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో మృతుని సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ. కాసుల శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement