Friday, March 29, 2024

జాతీయ రహదారి భద్రతా ముగింపు వారోత్సవాలు.. స్కూటర్ నడిపిన మంత్రి ఉషాశ్రీచరణ్

అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ – అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యక్రమంకు ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మోటార్ స్కూటర్ ను నడిపి ప్రాణం చాలా విలువైనది ..కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తెలుపుతూ వారోత్సవాలును ముగించారు. అనంతరం వారోత్సవాలపై విద్యార్ధులుకు నిర్వహించిన వ్యాసరచన పలు పోటీలలో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement