Thursday, April 25, 2024

విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడొద్దు: ఏపీ సర్కార్ కు నారా లోకేష్ వార్నింగ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జూలై మొద‌టి వారంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఏపీ స‌ర్కారు భావిస్తుండగా… పరీక్షలు రద్దు చేయలని విపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం “ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు – విద్యా సంవత్సరం వృథా” అనే అంశంపై విద్యార్థులు, విద్యావేత్తలతో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ముఖాముఖీ కార్యక్రమం నిర్వ‌హించారు.

క‌రోనా వ్యాప్తి వేళ‌ పరీక్షలు నిర్వ‌హించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటే త‌మ పార్టీ చూస్తూ ఊరుకోదని నారా లోకేష్‌ హెచ్చరించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతుండ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు  ఆందోళన చెందుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సురేశ్ చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌లు స‌రికావ‌ని పేర్కొన్నారు. కొవిడ్ విజృంభ‌ణ అధికంగా ఉన్న‌ప్ప‌టికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని విద్యావేత్త‌లు అన్నారు. కావాలంటే ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వంటి వాటిపై ఆలోచించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement