Thursday, April 18, 2024

సీఎం జ‌గ‌న్ లా మాట త‌ప్ప‌న‌న్న నారా లోకేష్‌

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి, సీఎం జగన్ లాగా తాను మాట తప్పనని.. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు జ‌రుగ‌నుండా… ముందే ప్రచారం ప్రారంభించారా అన్న రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా టీడీపీ, అధికార వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇరుపార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతున్నాయి. తాజాగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో టీడీపీ నేత‌లు పర్యటిస్తూ పలు రాజకీయ హామీలు చేస్తుండటం.. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారనే అనుమానం వస్తుంది.
ఇదిలా ఉండ‌గా టీడీపీ నేత నారా లోకేష్ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంగళ గిరిలో పర్యటిస్తున్న ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి సాయం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement