Friday, March 29, 2024

ఏ రాష్ట్ర‌మైనా వెళ్లేందుకు సిద్ధ‌మా?: సీఎం జగన్ కు లోకేష్ సవాల్

పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం చేసిన సూచనలను పట్టించుకోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. గ‌తంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు. పెట్రోల్ ధరపై అప్ప‌ట్లో జగన్ చేసిన వ్యాఖ్యల‌ను లోకేశ్ గుర్తు చేశారు.

‘చంద్ర‌బాబు గారి పాల‌న‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్లాలన్నారు. మీ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్ర‌మైనా వెళ్లేందుకు మేము సిద్ధం, మీరు సిద్ధ‌మా వ‌సూల్ రెడ్డి గారు’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement