Tuesday, March 26, 2024

Nara lokesh: రైతుల పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో?

అమరావతి రైతులు చేపట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం మ‌హాపాద‌యాత్ర వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? అని నిప్పులు చెరిగారు. హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో? అని లోకేష్ ప్రశ్నించారు. ఎండ‌న‌కా, వాన‌న‌కా  ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? అని నిలదీశారు. క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement