Thursday, March 28, 2024

కుప్పంలో నారా లోకేష్ కు వీరతిలకం.. యువగళంకు శ్రీకారం..

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఈరోజు చారిత్రక అడుగులు వేయనున్నారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు సిద్ధమయ్యారు. కుప్పంలో మహిళలు ఆయనకు వీరతిలకం దిద్దారు. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు. నారా లోకేష్ కుటుంబ సభ్యులు, పార్టీశ్రేణులతో కలిసి కుప్పం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌‌కు తోడుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు సంఘీభావంగా కలిసి నడవబోతున్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్థనలు చేసిన లోకేశ్ ఇవాళ పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని ఆరాధించిన తర్వాత పాదయాత్రను చేపట్టనున్నారు. ప్రతిరోజూ కనీసం పది కిలోమీటర్లమేర పాదయాత్ర సాగే విధంగా షెడ్యూలుతోపాటు రూట్ మ్యాప్‌ను సిద్ధంచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement