Saturday, April 20, 2024

అచ్చోసిన ఆబోతుల్లా వైసీపీ నేతలు: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్ ఫైర్

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించిన కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్‌ చేశారు. ‘అచ్చోసిన ఆబోతుల్లా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారు. దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

కాగా, గుంటూరు జిల్లాలో దుర్గిలో ఓ వైఎస్సార్‌సీపీ నేత రెచ్చిపోయాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. దుర్గికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్టానికులు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్‌ యార్జు ఛైర్మన్‌ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement