Thursday, April 25, 2024

మానవ మృగాలలో ఒక్కరికైనా శిక్ష వేశారా?: వైసీపీ సర్కార్ పై లోకేష్ ఫైర్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దారుణం అని ఆయన అన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని టీడీపీ నారా లోకేష్ అన్నారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతోందని మండిపడ్డారు. రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇస్తూ.. కేసులు నమోదు చేస్తూ తాలిబన్ల పాలనని తలపిస్తోందని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు.  వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవ మృగాలలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే ఇలాంటి నేరస్తులకు భయం పుట్టేది అని లోకేష్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement