Tuesday, March 26, 2024

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదు: నారా లోకేష్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒళ్లు బలిసి దళితుల పై దాడులు చేస్తున్న వైకాపా నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నాలు చెయ్యడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మాచర్ల గారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement